కొండా మురళి మాస్ వార్నింగ్..
ABN, First Publish Date - 2023-06-01T11:42:30+05:30
వరంగల్: నగరంలో కాంగ్రెస్ నేత కొండా మురళీ అనుచరులు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అనుచరుల మధ్య నిన్న జరిగిన వివాదంపై కొండా మురళీ ఘాటుగా స్పందించారు.
వరంగల్: నగరంలో కాంగ్రెస్ నేత కొండా మురళీ అనుచరులు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అనుచరుల మధ్య నిన్న జరిగిన వివాదంపై కొండా మురళీ (Congress Leader Konda Murali) ఘాటుగా స్పందించారు. తన కార్యకర్తలను టచ్ చేస్తే నాలో పాత మురళీ బయటకు వస్తాడు అంటూ హెచ్చరించారు. తన కార్యకర్తల జోలికి వస్తే క్రేన్కు ఉరివేసి వేలాడదీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖ దే... ఇది రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోనంటూ కొండా మురళీ ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు.
Updated Date - 2023-06-01T11:43:54+05:30 IST