ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
ABN, First Publish Date - 2023-09-11T10:33:15+05:30
అనంతపురం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి రిమాండ్కు పంపడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు టీడీపీ పిలుపిచ్చింది.
అనంతపురం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి రిమాండ్కు పంపడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు టీడీపీ పిలుపిచ్చింది. బంద్లో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పరిటాల శ్రీరామ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-11T10:36:08+05:30 IST