కిటకిటలాడిన వాడపల్లి
ABN, First Publish Date - 2023-01-08T01:29:42+05:30
వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆత్రేయపురం, జనవరి 7: వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే గోదావరి జలాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహించి తిరుప్పావై పాశురాలు నిర్వహిం చారు. స్వర్ణశోభితుడైన శ్రీవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని తల నీలాలు, తులాభారాలు, కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రాకార మండ పం నుంచి భారీ క్యూలైన్ల ద్వారా గోవింద నామస్మరణతో స్వామి వారిని దర్శించారు. సుమారు 30వేల నుంచి 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 20 వేల నుంచి 25 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరిం చారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.12.25,132 లభించినట్టు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ తెలిపారు.
Updated Date - 2023-01-08T01:29:42+05:30 IST