ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతిపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర భావోద్వేగం

ABN, First Publish Date - 2023-02-18T23:08:14+05:30

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న మృతి (Tarakaratna Death) పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu), టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నివాళులు అర్పించారు. తారకరత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడారని, చివరికి తమకు దూరమై కుటుంబానికి.. విషాదాన్ని మిగిల్చారని చంద్రబాబు అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో యువగళం పాద‌యాత్ర‌కు బ్రేక్ పడింది. తార‌క‌ర‌త్న‌కు నివాళులు అర్పించేందుకు ఆదివారం ఉదయం నారా లోకేష్ హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక తనకు వినిపించ‌దని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తానున్నానంటూ తన వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయిందని, నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని నారా లోకేష్‌ అన్నారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు అని లోకేష్ అన్నారు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌దని తార‌క‌ర‌త్న‌కు లోకేష్ క‌న్నీటి నివాళులు అర్పించారు. రేపు ఉదయం 6.30కు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు లోకేష్ రానున్నారు. తారకరత్న అంత్యక్రియల తర్వాత తిరిగి శ్రీకాళహస్తి నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు వారాల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌‌కు (PES) తరలించారు. ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం (Kuppam) నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా ట్రీట్మెంట్‌కు తారకరత్న శరీరం సహకరించలేదు. 23 రోజులుగా బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Updated Date - 2023-02-18T23:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising