ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విమలక్కకు ‘సుద్దాల’ పురస్కారం

ABN, First Publish Date - 2023-10-14T04:36:47+05:30

ఆదివాసీ ఆర్తనాదాలను, సబ్బండజాతి గుండె ఘోషలను తన గొంతుగా మలుచుకున్న ధిక్కార గళ గర్జని విమలక్క అని వక్తలు కొనియాడారు.

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ ఆర్తనాదాలను, సబ్బండజాతి గుండె ఘోషలను తన గొంతుగా మలుచుకున్న ధిక్కార గళ గర్జని విమలక్క అని వక్తలు కొనియాడారు. సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విమలక్కకు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ముఖ్య అతిథి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి అందచేసి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం జస్టిస్‌ రాధారాణి మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు పాటలతో పాటు విమలక్క పాటలంటే ఇష్టమని చెప్పారు. పీపుల్స్‌స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. లేడీ గద్దర్‌ విమలక్క అంటూ ప్రశంసించారు. తెలంగాణ నేల మీద పుట్టిన అరుదైన కవి సుద్దాల హనుమంతు అయితే, ఆయన పోరాట వారసత్వాన్ని గద్దర్‌, విమలక్క కొనసాగించారని ప్రొఫెసర్‌ కాసీం అన్నారు. తాను ఈ పురస్కారం అందుకోవడం ప్రజా ఉద్యమ పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు విమలక్క చెప్పారు. ఈ సందర్భంగా విమలక్కకు శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌ రెడ్డి రూ.50 వేల నగదును బహూకరించారు.

Updated Date - 2023-10-14T04:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising