ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లక్ష గాజులతో ఏడుపాయల దుర్గామాత

ABN, First Publish Date - 2023-06-26T02:54:36+05:30

ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గాభవాని మాతను అర్చకులు లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక అలంకరణ

పాపన్నపేట, జూన్‌ 25: ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గాభవాని మాతను అర్చకులు లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తల నీలాలు, బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో విందు భోజనాలతో, బంధు బలగంతో సందడి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సారా శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు పార్థీవశర్మ, శంకరశర్మ, రాజశేఖర్‌శర్మ, రాముశర్మ, మురళీధర్‌ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-06-26T02:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising