చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయకు!
ABN, First Publish Date - 2023-09-22T02:26:24+05:30
చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయకు’ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
‘చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయకు’ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గురువారం దుండిగల్లో ‘డబుల్’ ఇళ్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారు వహీదున్నీసాను ‘ఏం చేస్తావు.. పిల్లలు ఎంతమంది.. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉందా?’ అని కేటీఆర్ అడిగారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వివేకానంద.. వహీదా చాయ్ అమ్ముకుంటుందని చెప్పారు. చాయ్ అమ్ముతవా అని అడిగిన మంత్రి.. ‘చాయ్ అమ్ముకో. కానీ, దేశాన్ని మోసం చేయకు’ అన్నారు. వెంటనే ఆమె ‘నేనెవరినీ మోసం చేయనయ్యా. అలా చేస్తే మీ వరకు రాను’ అని చెప్పింది. ‘నువ్వు కాదు.. చాయ్ అమ్మి దేశాన్ని మోసం చేసినోళ్లు వేరే ఉన్నరు. వాళ్ల గురించి చెబుతున్న’ అని పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
Updated Date - 2023-09-22T02:26:24+05:30 IST