షాద్నగర్లో విశ్వశాంతి మహాయాగం
ABN, First Publish Date - 2023-09-21T23:50:14+05:30
ప్రజలు సుభిక్షంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలనే సంకల్పంతో షాద్నగర్లో విశ్వశాంతి మహాయాగం నిర్వహించబోతున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానందస్వామీజీ వెల్లడించారు.
14 రోజుల పాటు హోమాలు.. అక్టోబర్ 26న ప్రారంభం
శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ
షాద్నగర్ అర్బన్, సెప్టెంబరు 21: ప్రజలు సుభిక్షంగా.. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలనే సంకల్పంతో షాద్నగర్లో విశ్వశాంతి మహాయాగం నిర్వహించబోతున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానందస్వామీజీ వెల్లడించారు. షాద్నగర్లో గురువారం విశ్వశాంతి మహాయాగం నిర్వహణ, అవసరం, సత్ఫలితాలపై పట్టణ ప్రముఖులతో స్వామి చర్చించారు. స్థానిక శ్రీ బాలాజీ టౌన్షిప్ ఎదురుగా ఉన్న స్థలంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 8వరకు మహాయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వంటి దుర్భర పరిస్థితులు నెలకొనకుండా, భూకంపాలు, సునామీ లాంటి విపత్తులు ఏర్పడకుండా, కరోన వంటి వ్యాధులు రాకుండా, సుపరిపాలన సాగాలని, గోవుల సంరక్షణ, మహిళలకు రక్షణ కలగాలని, విద్యాభివృద్ధి, మేథస్సు పెరిగి.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-09-21T23:50:14+05:30 IST