ఎదురెదురుగా రెండు బైక్లు ఢీ.. వ్యక్తికి గాయాలు
ABN, First Publish Date - 2023-06-11T00:01:28+05:30
మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కేశంపేట, జూన్ 10: మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ ధనుంజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు పట్టణానికి చెందిన పూసల కోటయ్య అనే వ్యక్తి శనివారం మధ్యాహ్న సమయంలో మండలంలోని ఇప్పలపల్లి నుంచి కేశంపేటకు బైక్పై వస్తున్నాడు. ఈక్రమంలో ఇబ్రహీంపట్నంకు చెందిన జంగయ్య బైక్పై షాద్నగర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో కేశంపేట సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న కోటయ్య బైక్ను ఢీకొట్టాడు. దీంతో కోటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2023-06-11T00:01:28+05:30 IST