ఎండ ప్రచండం
ABN, First Publish Date - 2023-03-30T23:42:51+05:30
యాచారం మండల కేంద్రంలో ఎండలు భగ్గుమన్నాయి. గురువారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.
యాచారం మండల కేంద్రంలో ఎండలు భగ్గుమన్నాయి. గురువారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 8గంటల నుంచి ఎండలు మండి పోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శ్రీరామనవమి పండగ అయినా అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడ్డారు. చిరువ్యాపారులు సైతం వ్యాపారాలను మూసేసి ఇళ్లకు వెళ్లిపోయారు.
- యాచారం, మార్చి 30
Updated Date - 2023-03-30T23:42:51+05:30 IST