పాఠశాలల బంద్ విజయవంతం
ABN, First Publish Date - 2023-06-26T23:58:17+05:30
ప్రైవేటు పాఠశాలల్లో అక్రమ ఫీజుల వసూలును నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సోమవారం పాఠశాలల బంద్కు పిలుపునిచ్చాయి.
వికారాబాద్ రూరల్, జూన్ 26: ప్రైవేటు పాఠశాలల్లో అక్రమ ఫీజుల వసూలును నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సోమవారం పాఠశాలల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వికారాబాద్తో పాటు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగానే పాఠశాలల బంద్ను చేపట్టాయి. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సతీష్ సంఘం నాయకులు అక్బర్, అబ్దుల్, విజయ్ ఉన్నారు.
తాండూరు: తాండూరులో ఏబీవీపీ పిలుపుమేరకు బంద్ విజయవంతమైంది. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోనేశ్వరచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఉప్పల రాజేష్, నగర కార్యదర్శి కొండల్రెడ్డి, నాయకులు అజయ్, శ్రీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:58:17+05:30 IST