ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంటల సాగులో మెళకువలు పాటించాలి

ABN, First Publish Date - 2023-09-23T00:24:58+05:30

జిల్లాలో వానాకాలం పంటలు ఆశాజనంగా ఉన్నాయని, పంటల సాగులో రైతులు తగిన మెళకువలు పాటిస్తూ పెట్టుబడులు తగ్గించుకొని, దిగుబడులు పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి సూచించారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి

ఆమనగల్లు, సెప్టెంబరు 22 : జిల్లాలో వానాకాలం పంటలు ఆశాజనంగా ఉన్నాయని, పంటల సాగులో రైతులు తగిన మెళకువలు పాటిస్తూ పెట్టుబడులు తగ్గించుకొని, దిగుబడులు పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి సూచించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ విఠాయిపల్లి గ్రామంలో శుక్రవారం డీఏవో గీతారెడ్డి పర్యటించారు. పలువురు రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ చీడపీడల నివారణపై రైతులకు పలు సూచనలు చేశారు. పంటల్లో రసం పీల్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఏసిఫేట్‌ 1.5 గ్రాములను లీటర్‌ నీటికి క లిపి పిచికారి చేయాలని ఆమె తెలిపారు. ఆధనిక సేద్యం రైతులకు అన్ని విధాలా లాభదాయకమని గీతారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి, ఏఈవో మీనాక్షి, రైతులు మల్లమ్మ, మల్లయ్య, జగన్‌ మోహన్‌రెడ్డి, చిన్నమల్లయ్య, రాజేశ్‌, శంకర్‌, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising