బొక్కల కంపెనీని మూసే వరకూ పోరాటం
ABN, First Publish Date - 2023-03-05T23:30:13+05:30
నాలుగు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారిన బొక్కల కంపెనీ మూసేవరకు పోరాటం చేస్తామని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కిషన్పల్లి గ్రామాల రైతులు తేల్చి చెప్పారు.
యాచారం, మార్చి 5 : నాలుగు గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారిన బొక్కల కంపెనీ మూసేవరకు పోరాటం చేస్తామని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కిషన్పల్లి గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. ఆదివారం ఆ గ్రామాల రైతులు కంపెనీ ఎదుట ఆందోళన చేశారు. రోజూ ఆందోళన చేస్తున్నా అధికారులకు ఎందుకు పట్టడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి శాసనసభలో సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రస్తావించినా పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కంపెనీ నిర్వాహకులు బడా రాజకీయ నాయకులు కావడంతోనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో తక్కళ్లపల్లి సర్పంచ్ సంతోషతోపాటు రైతులున్నారు.
Updated Date - 2023-03-05T23:30:13+05:30 IST