ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ, గిరిజనులకు ఆత్మగౌరవ భవనాలు

ABN, First Publish Date - 2023-04-03T23:44:12+05:30

ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌లో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ. 2 కోట్లు చొప్పున మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌కు రూ. 2 కోట్లు చొప్పున మంజూరు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 3 : ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమనగల్లు, మహేశ్వరం, షాద్‌నగర్‌లో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ. 2 కోట్లు చొప్పున మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. గతంలో స్థానిక గిరిజనులు కోరిక మేరకు వీటిని నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివాసీల, గిరిజన సంస్కృతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె తెలిపారు.

Updated Date - 2023-04-03T23:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising