ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు

ABN, First Publish Date - 2023-09-21T23:48:42+05:30

ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ప్రమాదానికి గురైన బస్సు

పదిమందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఇబ్రహీంపట్నం సమీపంలో ఘటన

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 21 : ఆగి ఉన్న డీసీఎంను ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు(టీఎస్‌ 07 యూజీ 7172) గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నం నుంచి ప్రయాణికులతో నగరంలోని ఎంజీబీ్‌సకు బయలుదేరింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై రిపేరు కారణంగా రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను బస్సు వెనక నుంచి వేగంతో ఢీకొట్టింది. దీంతో కండక్టర్‌ బుగ్గ రాములుతో పాటు ప్రయాణికులు సుమలత, లక్ష్మమ్మ, మంగమ్మ, మల్లమ్మ, జంగయ్య, జగదీశ్వర్‌ సహా పదిమందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని డ్రైవర్‌తో పాటు మిగతా ప్రయాణికులు ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. కండక్టర్‌ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-09-21T23:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising