పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2023-07-16T00:28:30+05:30
మండల పరిధి గుడూర్లో శనివారం ఉదయం శంషాబాద్ ఎస్వోటీ దాడులు నిర్వహించి అరున్నర క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందని ఎస్ఐ శంకర్ తెలిపారు.
కొత్తూర్, జూలై 15: మండల పరిధి గుడూర్లో శనివారం ఉదయం శంషాబాద్ ఎస్వోటీ దాడులు నిర్వహించి అరున్నర క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందని ఎస్ఐ శంకర్ తెలిపారు. భువనగిరి ప్రాం తానికి చెందిన లింగ అనే వ్యక్తి గ్రామంలో అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ, పీడీఎస్ బియ్యాన్ని సైతం సేకరించి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2023-07-16T00:28:30+05:30 IST