విద్యుదాఘాతంతో పాడిగేదె మృత్యువాత
ABN, First Publish Date - 2023-05-31T23:52:13+05:30
మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుదాఘాతంతో పాడిగేదె మృత్యువాతపడింది. గ్రామానికి చెందిన రైతు లాల్రెడ్డి తనకున్న పాడిగేదెలను పొలంలో మేపుతున్నాడు.
యాచారం, మే 31 : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుదాఘాతంతో పాడిగేదె మృత్యువాతపడింది. గ్రామానికి చెందిన రైతు లాల్రెడ్డి తనకున్న పాడిగేదెలను పొలంలో మేపుతున్నాడు. ఆ సమయంలో విద్యుత్ స్తంభం నుంచి బోర్ మోటారుకు అనుసంధానంగా ఉన్న సర్వీస్ వైర్ ఓ గేదె కొమ్ములకు తగిలింది. దీంతో వైరు తెగిపోయి గేదెపై పడటంతో విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కాగా, తాను రూ.లక్షా పది వేలు అప్పుచేసి గేదెను తెచ్చానని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
Updated Date - 2023-05-31T23:52:13+05:30 IST