ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కింటి వారి దాడి.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-05-31T23:58:01+05:30

స్థలం విషయంలో గొడవ తలెత్తి పక్కింటి కుటుం బీకుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన టేకులపల్లిలో చోటుచేసు కుంది.

మృతిచెందిన గొల్ల రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోమిన్‌పేట్‌, మే 31: స్థలం విషయంలో గొడవ తలెత్తి పక్కింటి కుటుం బీకుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన టేకులపల్లిలో చోటుచేసు కుంది. ఎస్సై ఎం.విజయప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లికి చెందిన గొల్ల రాములు(48) తన పాత ఇంటిని కూల్చి నూతన నిర్మాణం చేపడుతున్నాడు. శేరిసందు విషయంలో అతడి పక్కింటికి చెందిన ఖాజా మొహినుద్దీన్‌, రహీమున్నీసా, జలాల్‌ పాషా, ఖైఫ్‌ అనేవ్యక్తులు రాములతో గొడవపడి అతడిని నెట్టేయగా రాములు డ్రైనేజీలో పడిపోయాడు. వెంటనే రాములు భార్య లక్ష్మి తన కుమారుడికి ఫోన్‌చేసి విషయం చెప్పారు. అక్కడికి చేరుకున్న రాములు కొడుకు మల్లేశ్‌ తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి సపర్యలు చేయగా అప్పటికే అతడు అపస్మారక స్థితికి వెళ్లాడు. ఆర్‌ఎంపీని పిలిపించి చూపించగా అతడు సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. మల్లేశ్‌ తన స్నేహితుల సహాయంతో రాములను కారులో సంగా రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పరీక్షించి రాములు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై రాములు పెద్ద కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2023-05-31T23:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising