ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2023-09-20T00:40:29+05:30

మండలంలోని తిమ్మాపూర్‌ వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు.

కొత్తూర్‌, సెప్టెంబరు 19: మండలంలోని తిమ్మాపూర్‌ వద్ద 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లోని నెహ్రుకాలనీకి చెందిన యాదయ్య మహేశ్వరంలోని ఓ వెంచర్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కాగా, సోమవారం ఆయన స్టేషన్‌తిమ్మాపూర్‌ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని మరొకరు..

నందిగామ, సెప్టెంబరు 19 : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మండల సమీపంలోని నూజివీడు సీడ్స్‌ పరిశ్రమ వెనుక ఉన్న రైలు పట్టాలపై స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Updated Date - 2023-09-20T00:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising