శుభకార్యానికి వెళ్లిన వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2023-03-30T23:20:53+05:30
శుభకార్యానికి వెళ్లిన వ్యక్తి నిద్రించిన చోటే మృతి చెందాడు. ఈ ఘటన కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది.
కొడంగల్, మార్చి 30: శుభకార్యానికి వెళ్లిన వ్యక్తి నిద్రించిన చోటే మృతి చెందాడు. ఈ ఘటన కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఏ.రవిగౌడ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్లోని గాంధీనగర్ కాలనీకి చెందిన గుర్రాల వెంకటప్ప(50) గుండ్లకుంటలో శుభకార్యం నిమిత్తం బుధవారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి కావడంతో అక్కడే నిద్రించాడు. గురువారం ఉదయం వెంకటప్ప ఎంతసేపైనా లేవకపోవడంతో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు గుర్రాల ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
5వ అంతస్తుపై నుంచి పడి కార్మికుడు..
ఘట్కేసర్ రూరల్, మార్చి 30: ప్రమాదవశాత్తు 5వ అంతస్తుపై నుంచి పడి ఓ సెంట్రింగ్ కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీ్సస్టేషన్ పరిధి కొర్రెములలో చోటుచేసుకుంది. సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన చింతకింది రమేష్(30) నగరంలోని బీఎన్రెడ్డి కాలనీ, హస్తీనాపురంలో ఉంటూ రామంతాపూర్కు చెందిన జంగిలి వెంకటేషం వద్ద సెంట్రింగ్ కూలీగా పనిచేస్తున్నాడు. కొర్రెముల, రాజరాజేశ్వరి వెంచర్లోని 5వ అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తూ బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో రమే్షకు తీవ్రగాయాలు కావడంతో మేడిపల్లిలోని ఓ పైవ్రేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు సెంట్రింగ్ గుత్తెదారు జంగిలి వెంకటేష్, బిల్డర్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - 2023-03-30T23:20:53+05:30 IST