రైతులను మోసగించిన బీఆర్ఎస్
ABN, First Publish Date - 2023-05-31T23:46:31+05:30
మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను మోసగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధోగతి తప్పదని బీజేపీ నాయకులు అన్నారు.
షాద్నగర్ అర్బన్, మే 31: మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను మోసగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధోగతి తప్పదని బీజేపీ నాయకులు అన్నారు. షాద్నగర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ షాద్నగర్ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ విజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్గౌడ్, సీనియర్ నాయకులు శ్రీవర్ధన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, బాబయ్య, భూపాలాచారిలు మాట్లాడారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంగళవారం షాద్నగర్కు వచ్చిన మంత్రి శ్రీనివా్సగౌడ్ తన హోదాను మరిచి, అహంకారంతో మాట్లాడడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు పల్లె ప్రగతికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రం ప్రచారం చేసుకుంటూ.. తిరిగి కేంద్రాన్ని విమర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివా్సగౌడ్కు చేతనైతే సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఇచ్చిన వాగ్ధానాల మేరకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కె.మనోహర్రెడ్డి, తదితరులున్నారు.
Updated Date - 2023-05-31T23:46:36+05:30 IST