ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

ABN, First Publish Date - 2023-05-31T23:52:55+05:30

వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం

క్షతగాత్రులు నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పల్గుతండావాసులు

కేశంపేట, మే 31: వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ తలకు బలమైన రక్తగాయమైంది. ఎస్‌ఐ ధనుంజయ్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్డండ మండలం పల్గు తండాకు చెందిన గిరిజనులు.. కొత్తూర్‌ మండలం వైఎం తండాలో వివాహానికి వచ్చారు. భోజనం అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో కేశంపేట మండలం అల్వాల గ్రామ సమీపంలో కాజ్‌వే సిమెంట్‌ దిమ్మెకు ఆటో బలంగా ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. డ్రైవర్‌ రూప్‌ సింగ్‌ తలకు బలమైన గాయాలు కాగా.. అర్జున్‌ అనే వ్యక్తి కాలికి స్వల్ప గాయమైంది. అదే విధంగా సాలీ, బుజ్జీల చేతులకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుల ను కేశంపేట పోలీసులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పెట్రోలింగ్‌ కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2023-05-31T23:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising