ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ శాఖలో దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-03-25T23:26:49+05:30

రెవెన్యూశాఖకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వికారాబాద్‌ రూరల్‌, మార్చి 25: రెవెన్యూశాఖకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహసీల్దార్‌ కార్యాలయంలో పెద్దమొత్తంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, జనన మరణ, కుటుంబసభ్యుల ధ్రువీకరణ పత్రాలతో పాటు సర్వేకు సంబంధించిన దరఖాస్తులు పెద్దఎత్తున పేరుకుపోయాయన్నారు. దరఖాస్తులన్నంటినీ పరిశీలించి పద్ధతి ప్రకారం వారం రోజుల్లో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంటే వీఆర్‌ఏల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో తాండూర్‌, పరిగి, మర్పల్లి, ధారూర్‌, కుల్కచర్ల మండలాల్లో అర్హులైన లబ్ధిదారుల నుంచి డబుల్‌బెడ్‌రూమ్‌ దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు దరఖాస్తులను స్వీకరించి వెంటనే విచారణ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీవోలు విజయకుమారి, అశోక్‌కుమార్‌, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising