ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చేనెల 10న కాంగ్రెస్‌ బీసీ గర్జన

ABN, First Publish Date - 2023-09-22T03:01:58+05:30

తెలంగాణలో వచ్చేనెల 10న కాంగ్రెస్‌ బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావు(వీహెచ్‌) వెల్లడించారు.

ముఖ్యఅతిథిగా సిద్ధరామయ్య: వీహెచ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చేనెల 10న కాంగ్రెస్‌ బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావు(వీహెచ్‌) వెల్లడించారు. షాద్‌నగర్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వీహెచ్‌ గురువారం నాడు ఢిల్ల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనుంది. తెలంగాణ భవన్‌లో వీహెచ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సభకు సిద్ధరామయ్య ముఖ్యఅతిథిగా హాజరవుతాయని వెల్లడించారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని, రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం ఉండాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని ఆయన తెలిపారు. బీసీ గర్జనను విజయవంతం చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారని, ఇంకా ఎక్కువ సీట్లు కేటాయించాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని వీహెచ్‌ తెలిపారు.

Updated Date - 2023-09-22T03:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising