మొదటి రోజు అర్చక పరీక్షలు ప్రశాంతం
ABN, First Publish Date - 2023-01-07T01:31:02+05:30
ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులుగా సేవలు అందించడానికి నిర్వహిస్తున్న వివిధ ఆగమ అర్చక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించారు.
నిజామాబాద్కల్చరల్, జనవరి 6: ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులుగా సేవలు అందించడానికి నిర్వహిస్తున్న వివిధ ఆగమ అర్చక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించారు. శుక్రవారం మాధవనగర్ సాయిబాబా కల్యాణ మండపంలో జరిగిన పరీక్షలో 126 మంది అభ్యర్థులకుగాను 95 మంది పరీక్ష రాశారు. 31 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షల్లో 126 మందికిగాను 97 మంది హాజరై 29 మంది గైర్హాజరయ్యారు. ఇన్విజిలేటర్లు ఎలాంటి మాల్ప్రాక్టిస్ లేకుండా పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పరీక్షలు సాయంత్రం 5గంటల వరకు కొనసాగాయి. జోనల్ ఆఫీసర్ విజయ్రామారావు, ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ పర్యవేక్షనలో వివిధ దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు, దేవాదాయశాఖ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో అర్చకులు హాజరై పరీక్షలు రాశారు.
Updated Date - 2023-01-07T01:31:04+05:30 IST