మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-02-06T23:27:31+05:30
మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో చోటు చేసుకుంది.
నిజాంసాగర్, ఫిబ్రవరి 6 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో చోటు చేసుకుంది. కొమలంచ గ్రామానికి చెందిన జవుతి లక్ష్మణ్ (37) మద్యానికి బానిసై ఆర్థికంగా ఇబ్బందులతో బాధ పడుతున్నాడు. దీంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి శవాన్ని పంపించినట్లు ఏఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Updated Date - 2023-02-06T23:27:33+05:30 IST