కారు ఢీకొని ముగ్గురికి గాయాలు
ABN, First Publish Date - 2023-06-03T00:59:12+05:30
కారు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
భువనగిరి రూరల్, జూన్ 2: కారు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన భువనగిరి మండలం కూనూరు కంట్రీ క్లబ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ నల్ల దిలీ్పకుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూనూరు గ్రామశివారులోని తోటలో పనిచేస్తున్న భరత్, ఉపేందర్, ఉప్పలమ్మలు పని నిమిత్తం రాయగిరికి రెండు ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. అదేసమయంలో మోత్కూరు నుంచి వస్తున్న కారు అదుపు తప్పిన వేగంతో ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్స్పై ఉన్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 వాహనంలో వారిని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దిలీ్పకుమార్ తెలిపారు.
Updated Date - 2023-06-03T00:59:12+05:30 IST