బాలిక ప్రాణం తీసిన ఈత సరదా
ABN, First Publish Date - 2023-06-07T00:39:48+05:30
ఈత సరదా బాలిక ప్రాణం తీసింది.
నూతనకల్, జూన 6: ఈత సరదా బాలిక ప్రాణం తీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన మట్టిపల్లి నందిని(12)మంగళవారం తోటి స్నేహితులతో కలసి ఈత నేర్చుకో వడానికి గ్రామ శివారులో ఉన్న పాలేరు వాగుకు వెళ్లింది. నీటిలో మునగ కుండా నడుముకి క్యానను కట్టుకుంది, ఈత కొడుతుండగా నడుముకి ఉన్న తాడు ఊడి, క్యాన కొట్టుకుపోవడంతో బాలిక నీటిలో మునిగింది. పక్కనే ఉన్న స్నేహితులు భయంతో ఇంటికి వెళ్లి బాలిక తల్లి గంగమ్మకు చెప్పారు. గ్రామస్థులు సాయంతో గంగమ్మ ఘటనా స్థలానికి చేరుకుని నీటిలో వెతకగా కుమార్తె మృతదేహం లబించింది. రెండు సంవత్సరాల క్రితం గంగమ్మ భర్త మృతి చెందాడు. ఇప్పుడు చిన్న కుమార్తె మృతి చెందడంతో గంగమ్మ రోదనలు స్తానికులను కంటతడి పెట్టించాయి.
రు.
Updated Date - 2023-06-07T00:39:48+05:30 IST