ఆర్ఆర్ఆర్ అలైనమెంట్ మార్చాలి
ABN, First Publish Date - 2023-03-27T23:59:05+05:30
రీజనల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) అలైనమెంట్ మార్చాలని చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం ప్రాంత రైతులు అధికారులను సోమవారం అడ్డుకున్నారు.
చౌటుప్పల్ రూరల్ మార్చి 27: రీజనల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) అలైనమెంట్ మార్చాలని చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం ప్రాంత రైతులు అధికారులను సోమవారం అడ్డుకున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టే ఎస్.లింగోటం పరిధిలోని సూపర్ గ్యాస్ కంపెనీ సమీపంలో సర్వేకు రెవెన్యూ, సర్వే అధికారులు వచ్చారు. సమాచారం తెలుసుకున్న నేలపట్ల, జైకేసారం, కుంట్లగూడెం, మందోళ్లగూడెం, ఎస్.లింగోటం, వలిగొండ మండలం వర్కట్పల్లి, గోకారం గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి, ఆర్ఆర్ఆర్ రోడ్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్ఆర్ఆర్ అలైనమెంట్ మార్చాలని, రహదారి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. స్పష్టమైన హామీఇచ్చిన తర్వాతే సర్వే నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. తహసీల్దార్ శ్యాంసుందర్రెడ్డి, సర్వేయర్ వెంకటయ్య, మురళీధర్రావును ఘెరావ్ చేశారు. ఆర్డీవో ఉపేందర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, బాధిత రైతులతో మాట్లాడారు. అయినా రైతులు వినకపోవడంతో సర్వే నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగారు.
Updated Date - 2023-03-27T23:59:05+05:30 IST