తెలంగాణలో టీటీడీ ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా రవిప్రసాద్
ABN, First Publish Date - 2023-09-08T00:51:31+05:30
తెలంగాణలోని తిరు మల తిరుపతి దేవస్థానానికి చెందిన దేవాలయాలు, ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యలిశాల రవిప్రసాద్ నియమితులయ్యారు.
నల్లగొండ, సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): తెలంగాణలోని తిరు మల తిరుపతి దేవస్థానానికి చెందిన దేవాలయాలు, ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యలిశాల రవిప్రసాద్ నియమితులయ్యారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, చైర్మన భూమన కరుణాకర్రెడ్డి ఉత్తర్వుల కాపీని అందజేశారు. ఈ సందర్భంగా రవిప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు టీటీడీ చైర్మన పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధితో పాటు ఆస్తులు రక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Updated Date - 2023-09-08T00:51:31+05:30 IST