ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కవలలకు ఎంబీబీఎస్‌లో సీట్లు

ABN, First Publish Date - 2023-09-22T00:42:53+05:30

కలలు కన్నారు.. ఆ కవలలు మెడిసిన సీట్లను సంపాదించారు.

తల్లిదండ్రులతో ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన ప్రణతి, ప్రణీత

ఆలేరు రూరల్‌, సెప్టెంబరు 21: కలలు కన్నారు.. ఆ కవలలు మెడిసిన సీట్లను సంపాదించారు. మండలంలోని గుండ్లగూడెం గ్రామానికి చెందిన ఆలేటి రాంచందర్‌ సుమిత్రలకు ముగ్గురు సంతానం వీరిలో ప్రణతి, ప్రణీతలు కవలపిల్లలు.. విద్యావంతులైన తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత సరిపోకున్నా.. తమ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. వారి కలలను ఆ కవలలిద్దరూ సాకారం చేయడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొన్నది. సాయి ప్రణతి గత సంవత్సరం నీట్‌ రాసి బీడిఎ్‌సను దిల్‌సుక్‌నగర్‌లోని పానినాయ డెంటల్‌ కళాశాలలో చేస్తుండగా ప్రణీత సూరారంలోని మల్లారెడ్డి డెంటల్‌ కళాశాలలో బీడిఎస్‌ చదువుతున్నది. దీంతో సంతృప్తి చెందని ఆ కవలలిద్దరూ తమ ఇంట్లోనే చదువుతూ మే 7, 2023న జరిగిన నీట్‌ పరీక్షను రాశారు. 13 జూన 2023న నీట్‌ ఫలితాలు రాగా వీరిద్దరికీ మంచి ఫలితాలు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం సాయి ప్రణతికి కామారెడ్డిలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాలలో, ప్రణీతకు మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్‌ కళాశాలలో సీట్లు లభించాయి. వీరిద్దరిని గ్రామ సర్పంచ ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు అభినందించారు. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లోని మేడిపల్లిలో నివాసం ఉంటోంది.

Updated Date - 2023-09-22T00:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising