కార్మికుల హక్కుల కోసం పోరాడదాం
ABN, First Publish Date - 2023-08-02T00:19:28+05:30
కార్మికుల హక్కుల కోసం పోరాడదామని ఇఫ్ట్యూ జిల్లా సహాయ కార్యదర్శి తురక శ్రీను అన్నారు.
గరిడేపల్లి, ఆగస్టు 1: కార్మికుల హక్కుల కోసం పోరాడదామని ఇఫ్ట్యూ జిల్లా సహాయ కార్యదర్శి తురక శ్రీను అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డిపల్లిలో నిర్వహించిన ఇఫ్ట్యూ మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మికులు పోరాటం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తోందన్నారు. హమాలీలకు పని భద్రత, ప్రమాదబీమా కల్పించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు క్లైమ్ల దరఖాస్తులను ఎనిమిది నెలల క్రితం అందజేసినా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించే ధర్నానలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పిట్టల అంజయ్య, నరేష్, చినలింగయ్య, పెదలింగయ్య, సుందరయ్య, ఏడుకొండలు, సైదులు, పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, ఎల్లయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-08-02T00:19:28+05:30 IST