ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ధనంతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

ABN, First Publish Date - 2023-06-03T00:34:09+05:30

ప్రభుత్వ ధనం తో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జీ బండారు రవివర్ధన్‌ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా శుక్రవారం భువనగిరిలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపా రు.

నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతున్న బీఎస్పీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జీ బండారు రవివర్ధన్‌

నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన

భువనగిరి టౌన్‌, జూన్‌ 2: ప్రభుత్వ ధనం తో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జీ బండారు రవివర్ధన్‌ ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా శుక్రవారం భువనగిరిలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం బందీ చేసుకుందన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ ధనంతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని, ప్రభుత్వ అధికారులే ప్రచారకులుగా వ్యవహరిస్తుండడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించి తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భట్టు రాంచంద్రయ్య, భూషపాక మల్లేష్‌, అన్నంపట్ల బాలస్వామి, పాండు, వడ్డెపల్లి దాసు, బాసాని మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising