27న వ్యవసాయ మార్కెట్లోని మడిగెల అద్దె వేలం
ABN, First Publish Date - 2023-09-22T00:46:10+05:30
మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మడిగెల (దుకాణాల)కు ఈ నెల 27న అద్దె వేలం నిర్వహించనున్నట్టు మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్రావు తెలిపారు.
మోత్కూరు, సెప్టెంబరు 21: మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మడిగెల (దుకాణాల)కు ఈ నెల 27న అద్దె వేలం నిర్వహించనున్నట్టు మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్రావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్లోని 10మడిగెల్లో జనరల్ 4, బీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1 కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకుని, రూ.20 వేలు డిపాజిట్ (ఈఎండీ) వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి, మోత్కూరు పేరున తీసిన బ్యాంకు డీడీతో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతి దుకాణానికి రూ.5వేలు అద్దె నిర్ణయించిందని, అంతకన్నా ఎక్కువ పాడిన వారికే దుకాణం కేటాయిస్తారన్నారు.
Updated Date - 2023-09-22T00:46:10+05:30 IST