కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
ABN, First Publish Date - 2023-09-12T03:20:53+05:30
అసోంలో పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అక్కడి కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం గువాహటిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అసోంలో పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అక్కడి కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం గువాహటిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతోపాటు దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎ్సను మరోసారి ఆశీర్వదిస్తారని, సీఎంగా కేసీఆర్ను గెలిపిస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-12T03:20:53+05:30 IST