సంగారెడ్డి, ఖేడ్లో భాషోపాధ్యాయుల నిరసనలు
ABN, First Publish Date - 2023-02-04T23:21:58+05:30
తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ భాషా పండితుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో శనివారం సంగారెడ్డి, నారాయణఖేడ్లో భాషోపాధ్యాయులు అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.
సంగారెడ్డి అర్బన్/నారాయణఖేడ్, ఫిబ్రవరి 4: తెలుగు, హిందీ భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని కోరుతూ భాషా పండితుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో శనివారం సంగారెడ్డి, నారాయణఖేడ్లో భాషోపాధ్యాయులు అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను ఇచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాషోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం ఇచ్చిన మాట ప్రకారం భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 1నుంచి 9, 10 తరగతులకు బోధనను బహిష్కరించి సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో భాషోపాధ్యాయులు చంద్రమోహన్, సాయిలు చారి, మల్లికార్జున్, పూర్ణకృష్ణ, సంజీవులు, సంతోశ్కుమార్, ప్రకాశ్, రంజిత్నాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-04T23:21:59+05:30 IST