మోడల్ ప్రాంతంగా గజ్వేల్ నియోజకవర్గం
ABN, First Publish Date - 2023-05-13T23:43:46+05:30
జగదేవ్పూర్, మే 13: సీఎం కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ ప్రాంతం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నదని, తెలంగాణలోనే గజ్వేల్ మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి అన్నారు.
ఎఫ్డీసీ చైర్మన్ ప్రతా్పరెడ్డి
జగదేవ్పూర్, మే 13: సీఎం కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ ప్రాంతం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నదని, తెలంగాణలోనే గజ్వేల్ మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి అన్నారు. శనివారం జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల, గొల్లపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతా్పరెడ్డి మాట్లాడుతూ రైతు రాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని రైతు సంక్షేమ ఫలాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రాంతంలో తొమ్మిదేళ్ల క్రితం పదివేల ఎకరాల్లో వరిసాగు జరిగితే, ప్రస్తుతం 75 వేల ఎకరాల్లో వరి విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్, మమతాఅంజిరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, మాజీ సర్పంచ్ మహేందర్గౌడ్, ఉపసర్పంచ్ సిద్ధులు, కరుణాకర్, బిక్షపతి, వెంకటయ్య పాల్గొన్నారు.
Updated Date - 2023-05-13T23:43:46+05:30 IST