ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాటలతో చైతన్యం తెచ్చిన గొప్ప గాయకుడు గద్దర్‌

ABN, First Publish Date - 2023-09-23T00:12:41+05:30

తన పాటల ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చి తనకంటు ప్రత్యేక స్థానం పొందిన గొప్ప ప్రజాగాయకుడు గద్దర్‌ అని ప్రొఫెసర్‌ కొదండరాం కొనియాడారు.

సభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

సంస్మరణ సభలో ప్రొఫెసర్‌ కోదండరాం

నర్సాపూర్‌, సెప్టెంబరు 22: తన పాటల ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చి తనకంటు ప్రత్యేక స్థానం పొందిన గొప్ప ప్రజాగాయకుడు గద్దర్‌ అని ప్రొఫెసర్‌ కొదండరాం కొనియాడారు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లో జెజ్జనక కళాబృందం ఆధ్వర్యంలో గద్దర్‌ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదండరాంతో పాటు గద్దర్‌ కూతురు వెన్నెల హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నా వారికి అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకు పోరాడిన వ్యక్తి గద్దర్‌ అని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం తనదైన శైలిలో పోరాడిన ప్రజాగాయకుడు అని కొనియాడారు. గద్దర్‌ తన పాటల రూపంలో ఎందరినో మార్చడమే కాకుండా ఇప్పుడు ఇంతమంది ప్రజాగాయకులుగా ఉన్నారంటే అదంతా ఆయనే కారణమన్నారు. గద్దర్‌ కూతురు వెన్నెల మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన వ్యక్తి అని తెలిపారు. గద్దర్‌ ఓ జ్ణానవంతుడు, నిశబ్ద విప్లవమన్నారు. కార్యక్రమంలో శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, గాయకుడు యాదగిరి, కళాబృందం ప్రతినిధులు అల్లీపూర్‌రమేష్‌, మైసయ్య, కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising