ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలూరు జాతరలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-01-07T23:41:41+05:30

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ని ఆలూరు గ్రామ ఆంజనేయస్వామి జాతరలో శనివారం నిర్వహిం చిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నిలిచిపోయిన ఎద్దుల బండలాగుడు పోటీలు

గట్టు, జనవరి 7 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ని ఆలూరు గ్రామ ఆంజనేయస్వామి జాతరలో శనివారం నిర్వహిం చిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో ఉద్రిక్తత నెలకొంది. జాతరలో ఈ సంవత్సరం ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడానికి బీ జేపీ నాయకులు సన్నాహాలు చేశారు. పోటీలు ప్రారంభించడానికి మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి హాజరయ్యారు. పోటీలను గ్రామం లో పది శాతం వదిలిన స్థలంలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. పోటీలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్న తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. గట్టు, ధరూరు ఎస్సైలు పవన్‌కుమార్‌, ఽశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకొని బండలాగు డు పోటీలను నిలుపుదల చేశారు. పోటీలు నిర్వహిస్తున్న స్థలం వివాదంలో ఉందని, శాంతిభద్రతల సమ స్య ఏర్పడుతుందని, పోటీలు నిర్వహించొద్దని నిర్వాహకులకు ఎస్సై పవన్‌కుమార్‌ సూచించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి కలుగజేసుకోవడంతో కొద్దిసేపు పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘాటుగా హెచ్చరించడంతో చేసేది లేక పోటీలను నిలుపుదల చేశారు. దీం తో సాయంత్రం వరకు ఎలాంటి గొడవలు జరుగుతాయోనన్న అందోళన గ్రామంలో నెలకొంది. పోలీసులు రాత్రి వరకు జాతరలో తిష్ట వేసి ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించి, జాతర కార్యక్రమాలను పూర్తి చేయించారు. జాతర ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-01-07T23:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising