బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక
ABN, First Publish Date - 2023-09-22T22:51:05+05:30
మల్దకల్ మండల పరిధిలోని నీలిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పలువురు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 22 : మల్దకల్ మండల పరిధిలోని నీలిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పలువురు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఏసేపు, రాజు, బజారన్న, సంఘటి, గోపాల్, డేవిడ్, కిరణ్, సుధాకర్, చిలక గోపాల్తో పాటు మరికొందరు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు ఏలేష్, రాజేశ్, శంకర్, మల్లేశ్, తిమ్మప్ప, ముదిరెడ్డి, చిన్న బడేసాబ్, రామ్రెడ్డి పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ధరూర్ మండలం బురెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురికి ఆయన లెర్నింగ్ లైసెన్స్ ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయ్రెడ్డి పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన షోహెబ్కు సీఎం సహాయనిఽధి నుంచి మూడు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ, చెక్కులను అందించారు.
Updated Date - 2023-09-22T22:51:05+05:30 IST