ఘనంగా శోభాయాత్ర
ABN, First Publish Date - 2023-03-30T23:19:20+05:30
శ్రీరామ నవమిని పురస్కరించుకొని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని పళ్ల హనుమాన్ ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, కాంగ్రెస్ నా యకుడు కుంభం శివకుమార్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
- జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించిన నామాజీ
నారాయణపేట, మార్చి 30 : శ్రీరామ నవమిని పురస్కరించుకొని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని పళ్ల హనుమాన్ ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, కాంగ్రెస్ నా యకుడు కుంభం శివకుమార్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ పట్టణ పుర వీధుల గుండా వెళ్తూ రామ మందిరానికి చేరుకుంది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్, బీజేపీ నాయకులు రఘురామయ్య, నందు, కౌన్సిలర్ సత్య రఘుపాల్, మహేష్, వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు రఘునాథ్, మెళగికి కాంబ్లే, శ్రీకాంత్, శ్రీని వాస్, చిన్నరఘు, వెంకటేష్, ప్రవీణ్, శ్రావణ్, రవి, చేతన్, వెంకటేష్, సంతోష్, భ రత్, మణి, మోదీ, బీఆర్ఎస్ నాయకులు విజయ్సాగర్, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-03-30T23:19:20+05:30 IST