Tummala Nageswara Rao: నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్..
ABN, First Publish Date - 2023-01-15T15:28:20+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దమ్మపేట మండలం, మందలపల్లిలో చౌదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దమ్మపేట మండలం, మందలపల్లిలో చౌదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో స్వర్గీయ ఎన్టీ రామారావు (NT Ramarao) విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
డుతూ.. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు అని, సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపు మేరకు బీఆర్ఎస్ (BRS)లో కొనసాగుతున్నానని అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ ప్రజలను ఎప్పుడూ మరచిపోనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు (Chandrababu), కేసీఆర్ ప్రభుత్వాలలో ఎక్కడా తలవంచకుండా పనులు చేసి శభాష్ అనిపించుకున్నానన్నానని.. అది తనకు ఎన్టీఆర్ ఇచ్చిన శక్తి, స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ భిక్షతో ప్రజలు, ప్రాంతం, పేదలు, రైతులు, బడుగుల సంకల్పం కోసమే కష్టపడతానన్నారు. భవిష్యత్తులోనూ స్వర్గీయ ఎన్టీఆర్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-01-15T15:28:23+05:30 IST