ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కథారచయిత భమిడిపాటి కన్నుమూత

ABN, First Publish Date - 2023-02-07T03:52:05+05:30

రచయితగా కంటే పౌరుడిగా ఉండటమే ఇష్టమని’ ప్రకటించిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు (89) హఠాన్మరణం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలువురు సాహితీవేత్తల నివాళులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రచయితగా కంటే పౌరుడిగా ఉండటమే ఇష్టమని’ ప్రకటించిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు (89) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం స్పృహ తప్పి పడిపోయి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా ఆయన కోకాపేటలోని పెద్దకూతురు పద్మ వద్ద ఉంటున్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు. సాహితీ దిగ్గజాలు పాలగుమ్మి పద్మరాజు, దిగుమర్తి సీతారామస్వామిల శిష్యుడైన భమిడిపాటి నాగపూర్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఢిల్లీలోని తెలుగు సమాచార, పౌర సం బంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా, గవర్నర్‌ ప్రెస్‌ సెక్రటరీగా వివిధ హోదాల్లో పనిచేశారు భమిడిపాటి. 1959లో కథారచన ప్రారంభించి సము ద్రం’, ‘మంటల్లో జాబిల్లి’, ‘బంతి’ కథలతో ప్రత్యేకగుర్తింపును పొందారు. ‘భమిడిపాటి జగన్నాథరావు కథలు’, ‘మువ్వలు’, ‘అడుగుజాడలు’ కథాసంపుటాలు, ‘పరస్పరం’ రచనలు పుస్తకాలుగా వచ్చాయి. ఆయన భౌతికకాయానికి కథాసాహితీ నిర్వాహకుడు వాసిరెడ్డి నవీన్‌, రచయిత రాజారామ్మోహన్‌రావు నామాడి శ్రీధర్‌, ఒమ్మి రమేష్‌బాబు, సాహితీవేత్తలు నివాళులు అర్పించారు. కొత్తగూడ ఇజ్జత్‌నగర్‌ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి.

Updated Date - 2023-02-07T03:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising