ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: కుమారుడిని విమానాశ్రయంలో వదిలి వస్తూ..అనంత లోకాలకు..

ABN, First Publish Date - 2023-01-26T08:40:18+05:30

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న కొడుకును విమానాశ్రయంలో వదిలి తిరిగి వస్తున్న తండ్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/దుండిగల్‌: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న కొడుకును విమానాశ్రయంలో వదిలి తిరిగి వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మెదక్‌ జిల్లా, శివంపేట దంతి గ్రామానికి చెందిన పిట్ల నిరంజన్‌ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడు. అతడిని శంషాబాద్‌ విమానాశ్రయంలో వదిలిన తండ్రి పిట్ల నరేష్‌(52), తల్లి మాణికేశ్వరి, స్నేహితులు నిఖిల్‌, నక్క వంశీ కారులో బుధవారం ఓఆర్‌ఆర్‌ మీదుగా తిరిగి వస్తున్నారు. డ్రైవర్‌ కారును వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న నరేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు గాయపడ్డారు. దుండిగల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారును వేగంగా నడిపిన పిట్ల వినయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు.

Updated Date - 2023-01-26T08:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising