సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన హరీశ్
ABN, First Publish Date - 2023-02-07T04:10:39+05:30
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకు ముందు హరీశ్ రావు ఇంటి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దేవాలయానికి పెద్దఎత్తున చేరుకున్నారు. అనంతరం 10.30 గంటలకు అక్కడి నుండి అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాగానే మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులిద్దరూ సీఎంకు పాదాభివందనం చేశారు. సీఎం వారిని ఆశీర్వదించారు.
Updated Date - 2023-02-07T04:10:58+05:30 IST