డేటా చౌర్యం కేసులో రంగంలోకి ఈడీ
ABN, First Publish Date - 2023-03-31T03:46:02+05:30
డేటా చౌర్యం కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టనుంది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) పొందుపరచి విచారణ చేపట్టింది.
మనీ లాండరింగ్ కోణంలో విచారణ
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): డేటా చౌర్యం కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టనుంది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) పొందుపరచి విచారణ చేపట్టింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, వ్యాపారులు, దేశభద్రత విభాగాల్లో విధులు నిర్వహిస్తోన్న వారితో పాటు సుమారు 16 కోట్ల మందికిపైగా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ముఠా వివిధ మార్గాల్లో ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి అవసరమైన వారికి విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొంత డేటా విదేశాలకు కూడా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు డేటా విక్రయించడం, అక్కడి నుంచి నగదు లావాదేవీలు జరిపిన నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది.
Updated Date - 2023-03-31T03:46:02+05:30 IST