అవినాశరెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయండి
ABN, First Publish Date - 2023-06-07T03:33:40+05:30
వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాశరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు
సీబీఐ చూపించిన ఆధారాలను పట్టించుకోలేదు
సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన
సీబీఐ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం
న్యూఢిల్లీ, జూన 6 (ఆంధ్రజ్యోతి): వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాశరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు గత నెల 31న ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన దాఖలు చేశారు. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని.. ముఖ్యంగా సీబీఐ చూపించిన ఆధారాలను పట్టించుకోలేదని.. హైకోర్టు ఉత్తర్వుల్లో అనేక లోపాలు ఉన్నాయని అందులో ఆమె పేర్కొన్నట్లు సమాచారం. బుధవారం ఈ పిటిషనను ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ పిటిషనలో సీబీఐ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశాలున్నాయని న్యాయవాదులు అంటున్నారు.
Updated Date - 2023-06-07T03:33:40+05:30 IST