ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి నుంచి పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌

ABN, First Publish Date - 2023-07-18T05:08:02+05:30

ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎ్‌సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్‌ బస్‌పా్‌సకు శ్రీకారం చుట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు జిల్లా కేంద్రాల్లో అమలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎ్‌సఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్‌ బస్‌పా్‌సకు శ్రీకారం చుట్టింది. మొదట కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లెవెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలుచేయాలని నిర్ణయించింది. ఈ టౌన్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో 10 కిలోమీటర్లు, నిజామాబాద్‌, నల్లగొండల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సోమవారం బస్‌పాస్‌ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500 చొప్పున చెల్లించి పల్లె వెలుగు టౌన్‌ బస్‌పా్‌సను తీసుకోవచ్చని తెలిపారు. ఈ పాస్‌ మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌లో జనరల్‌ బస్‌పాస్‌ అందుబాటులో ఉందన్నారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై ఆర్థికభారం తగ్గ్గించేందుకు పల్లె వెలుగు టౌన్‌ బస్‌పాస్‌ ఉపయోగంగా ఉంటుందన్నారు.

Updated Date - 2023-07-18T05:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising