బీజేపీలోకి జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్
ABN, First Publish Date - 2023-03-02T03:18:36+05:30
జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
జగిత్యాల, న్యూఢిల్లీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమె భర్త ప్రవీణ్, అలానే మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి వారికి సభ్యత్వ పత్రాలను అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ బోగ శ్రావణి రాజీనామా చేసి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
Updated Date - 2023-03-02T03:18:36+05:30 IST