ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏడేళ్ల బాలికపై తండ్రి, కొడుకు అత్యాచారం

ABN, First Publish Date - 2023-08-12T03:41:22+05:30

ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను ఓ వ్యక్తి, అతడి కుమారుడు సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశచూపి ఇంట్లోకి రప్పించుకున్నారు.

సెల్‌ఫోన్‌ ఆశ చూపి ఇంట్లోకి రప్పించి దారుణం

జీడిమెట్ల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను ఓ వ్యక్తి, అతడి కుమారుడు సెల్‌ఫోన్‌ ఇస్తామని ఆశచూపి ఇంట్లోకి రప్పించుకున్నారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌ పరిధిలో గురువారం ఈ దారుణం జరిగింది. బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఓ కుటుంబం కొంపల్లి ప్రాంతంలో నివాసం ఉంటోంది. భార్యభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఏడేళ్ల పాపను ఇంట్లోనే వదిలేసి పనికి వెళతారు. గురువారం ఇంటి పక్కనే ఉంటున్న ఓ వ్యక్తి (45), అతడి కుమారుడు (18) బాలికను ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి ఒడిగట్టారు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులను చూసి పాప కడుపునొప్పి వస్తోందని రోదించింది. చిన్నారి దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో ఏం జరిగిందని ప్రశ్నించారు. బాలిక తన పట్ల జరిగిన ఘోరాన్ని చెప్పడంతో ఆమెను తీసుకొని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల్లో పాపపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. వైద్యం కోసం ఆ చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులైన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-08-12T03:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising